Tuesday, March 28, 2023
HomeAP Newsదావోస్‌కు వైయ‌స్ జ‌గ‌న్‌

దావోస్‌కు వైయ‌స్ జ‌గ‌న్‌

గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ప‌య‌నం
వీడ్కోలు ప‌లికిన స‌మీర్ శ‌ర్మ‌, డీజీపీ
గ‌న్న‌వ‌రం, మే 20:
దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం బ‌య‌లుదేరి వెళ్ళారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ఆయ‌న బయలుదేరారు. రాత్రికి ఆయ‌న దావోస్ చేర‌తారు. స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్ ప్ర‌తి ఏటా ప్ర‌పంచ ఆర్థిక ఫోరం ఆధ్వ‌ర్యంలో స‌ద‌స్సు జ‌రుగుతుంది. హాజ‌ర‌య్యే వారు త‌మ ప్రాంతాల‌లో ఉన్న సౌక‌ర్యాలు, క‌ల్పించే వ‌స‌తులు వంటివి వివ‌రిస్తారు. ఈ స‌ద‌స్సుకు హేమాహేమీలైన పారిశ్రామిక‌వేత్త‌లు హాజ‌ర‌వుతారు.


మే 22 నుంచి మే 26 వరకు సదస్సు జ‌రుగుతుంది. క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌డం లేదు. దావోస్‌కు బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు ప‌లికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ