గాంధీ గారి కుర్చీ

Date:

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)
2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో టి. నగర్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వెళ్ళొచ్చాను. 1918 లో గాంధీజీ చివరి కుమారుడు దేవదాస్ గాంధీ ఓ శిక్షణ తరగతి నిర్వహించడంతో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. వందేళ్ళ పైచిలుకు చరిత్ర ఉన్న ఈ సంస్థ సెక్రెటరీ జి. సెల్వరాజన్ ని కలిసి, గాంధీజీ సంబంధించిన నాలుగు పుస్తకాలను వారి లైబ్రరీకి ఇచ్చిన విషయం ఇదివరకే రాశాను. ఈ సంస్థకు ఉత్సవాలు 1946 జనవరి 20 నుంచి పది రోజులు పాటు జరిగినప్పుడు, గాంధీజీ అతిథిగా వచ్చి ఈ భవనంలోనే ఉన్నారు.


ఆయన వాడిన మంచం ఇక్కడ ఉంది. దాని పక్కనే ఓ కుర్చీ కూడా ఉంది. ఆ కుర్చీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ అంశం అందరికీ తెలియజేజడానికే రెండు మాటలు. 1933 డిసెంబర్ 26న గాంధీజీ ఆంధ్రప్రదేశ్ లోని తాళ్లపూడి గ్రామానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు అక్కడి వారిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఓ కుర్చీని వినియోగించారు. ఆ పూట నుంచి ఆ కుర్చీని గౌరవంగా జాగ్రత్త చేశారు. గోకవరపు రాజారావు అనే మిత్రుడు ఆ కుర్చీని దక్షిణ భారత హిందీ ప్రచార సభకు బహుకరించగా, సభ ఆ కుర్చీని సందర్శనార్థం ఇలా ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...

చీర కట్టుకుని రీల్స్ చేసినందుకు…

శారీ మూవీ వెనుక నిజాలు(వైజయంతి పురాణపండ) చీరకి చాలానే చరిత్ర ఉంది.పురాణ కాలంలో...