గాంధీ గారి కుర్చీ

Date:

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)
2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో టి. నగర్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వెళ్ళొచ్చాను. 1918 లో గాంధీజీ చివరి కుమారుడు దేవదాస్ గాంధీ ఓ శిక్షణ తరగతి నిర్వహించడంతో ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. వందేళ్ళ పైచిలుకు చరిత్ర ఉన్న ఈ సంస్థ సెక్రెటరీ జి. సెల్వరాజన్ ని కలిసి, గాంధీజీ సంబంధించిన నాలుగు పుస్తకాలను వారి లైబ్రరీకి ఇచ్చిన విషయం ఇదివరకే రాశాను. ఈ సంస్థకు ఉత్సవాలు 1946 జనవరి 20 నుంచి పది రోజులు పాటు జరిగినప్పుడు, గాంధీజీ అతిథిగా వచ్చి ఈ భవనంలోనే ఉన్నారు.


ఆయన వాడిన మంచం ఇక్కడ ఉంది. దాని పక్కనే ఓ కుర్చీ కూడా ఉంది. ఆ కుర్చీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ అంశం అందరికీ తెలియజేజడానికే రెండు మాటలు. 1933 డిసెంబర్ 26న గాంధీజీ ఆంధ్రప్రదేశ్ లోని తాళ్లపూడి గ్రామానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు అక్కడి వారిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఓ కుర్చీని వినియోగించారు. ఆ పూట నుంచి ఆ కుర్చీని గౌరవంగా జాగ్రత్త చేశారు. గోకవరపు రాజారావు అనే మిత్రుడు ఆ కుర్చీని దక్షిణ భారత హిందీ ప్రచార సభకు బహుకరించగా, సభ ఆ కుర్చీని సందర్శనార్థం ఇలా ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...