క్రికెట్ ఫైనల్లో భారత్

Date:

సెమిస్ లో కివీస్ ను ఓడించిన మెన్ ఇన్ బ్లూ
50 వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

మెన్ ఇన్ బ్లూ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో ప్రవేశించింది. 2019 సెమిస్ లో ఓటమికి న్యూజిలాండ్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 70 పరుగుల తేడాతో కివీస్ ను ఓడించింది. 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే యత్నంలో 321 పరుగులకు అంతా అవుటయ్యాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కివీస్ బాట్స్మన్ మిషెల్ ఒంటరి పోరాటం చేసాడు. 43 , 44 ఓవర్లలో వరుసగా రెండు వికెట్లను పడగొట్టిన బుమ్రా, కులదీప్ యాదవ్ భారత విజయాన్ని ఖరారు చేశారు. మహమ్మద్ సిరాజ్ 40 వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు ఇవ్వడంతో భారత శిబిరంలో పేరుకున్న నిస్తేజాన్ని ఈ రెండు వికెట్లు తొలగించాయి. షమీ 7 వికెట్లు పడగొట్టాడు. మొదటి రెండు వికెట్లను 38 పరుగులకే కోల్పోయిన కివీస్ జట్టును కెప్టెన విలియం సన్, మిచెల్ 200 పరుగుల భాగస్వామ్యంతో గాడిన పెట్టారు. ఆ తరవాత ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలయ్యారు. మిషెల్ 134 పరుగులకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్లో సిక్స్ కొట్టబోయి బౌండరీ లైన్ దగ్గర జడేజా చేతికి చిక్కాడు. ఈ అవుటుతో కివీస్ పరాజయం ఖాయమైంది.


టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ
ప్రేక్షకులలో ఒక పక్కన అనుష్క శర్మ, మరో పక్కన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్… ఇంకొక పక్కన సహచర క్రికెటర్లు… అంతా చూస్తుండగా విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వన్ డే చరిత్రలో కొత్త చరిత్రను లిఖించాడు. క్రికెట్ దేవుడి సెంచరీల రికార్డును చెరిపేసాడు. రవీంద్ర వేసిన బంతిని బౌండరీకి తరలించి తన 50 వ సెంచరీని సాధించాడు. అంతే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. అనుష్క శర్మ స్టాండ్స్ నుంచే తన భర్త కోహ్లీకి ముద్దుల వర్షం కురిపించింది. ప్రతిగా కోహ్లీ సైతం ఒక ఫ్లైయింగ్ కిస్ ను సమాధానంగా పంపాడు. క్రికెట్ వరల్డ్ కప్ మొదటి సెమి ఫైనల్ లో కోహ్లీ చెలరేగి ఆడాడు. క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని నమోదు చేసి 117 పరుగులకు అవుటయ్యాడు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్
ముంబైలో బుధవారం మొదటి సెమి ఫైనల్లో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన రోగిట్ 38 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 47 పరుగులు చేసి అవుటయ్యాడు. అతనికి తోడుగా నిలిచినా శుభమాన్ గిల్ 77 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ – గిల్ జంట బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ స్టాండ్స్ లో అసహనంగా కదులుతూ కనిపించాడు. కొద్దిసేపటికి అశ్విన్తో ఏదో సందేశం పంపడం… ఆ తరవాత ఒక ఓవరుకే గిల్ రిటైర్డ్ హర్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ దశలో కోహ్లీకి జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడుతూ, కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలిపాడు. కోహ్లీ అవుటైన తరవాత అయ్యర్ బ్యాటింగ్ స్పీడ్ మరింత పెరిగింది. 67 బంతుల్లో సెంచరీ పూర్తిచేసాడు. మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సులు ఇందులో ఉన్నాయి. భారత్ జట్టు 50 ఓవర్లలో 397 పరుగులు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...