మేడిగడ్డ ఒక మేడిపండు: ముఖ్యమంత్రి రేవంత్

Date:

కోటి ఎకరాలకు నీరు పచ్చి అబద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సమీక్ష
సందర్శనకు ఎందుకు రాలేదని బి.జె.పి. పై విసుర్లు
మేడిగడ్డ, ఫిబ్రవరి 13 :
కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన అనంతరం ఆయన మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదనీ, రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనానీ తెలిపారు.
కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంది.
ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది.
ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు.


2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశారు.
సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు.
మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు.
నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి.
ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారు.
రీడిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టుకున్నారు.


ప్రజల ముందు తన బండారం బయటపడుతుందనే నల్లగొండలో కేసీఆర్ సభలో మాపై ఎదురుదాడికి దిగారు.
చావు నోట్లో తలకాయ పెట్టానని కేసీఆర్ కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారు.
కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలేదు..
మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం.


మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి గారు లేఖ రాశారు.
మీకు తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పాం..
కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు..
నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా?
నాలుగైదు పిల్లర్లు కూలాయని కేసీఆర్ చులకనగా మాట్లాడుతున్నారు..
మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలై పోయింది.
మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.
KRMB పై తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ అంటున్నారు.
సభకు వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెబుతున్నాం..


తీర్మానంలో లోపాలు ఉంటే హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారు..
అందుకే వారి మాటలకు విలువ లేదని కేసీఆర్ సభకు రావాలని మేం కోరాం..
నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి..
కేసీఆర్ మమ్మల్ని వెంటాడుతాం.. అంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు.
కాళేశ్వరంపై చర్చకు రావడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు
మీ కార్యదర్శి మీ అనుమతి లేకుండానే లేఖ రాశారా?


నీ అబద్దాలు నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా?
కేసీఆర్ ను ఈ వేదికగా ఆహ్వానిస్తున్నా…
రేపు ఉదయం సభకు రండి… బడ్జెట్ తో పాటు, సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనండి..
అన్ని పాపాలకు కారణం కేసీఆరే..


స్వార్ధం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చండి.
మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు స్పష్టంగా కమిపిస్తున్నా.. చిన్న సంఘటనగా కేసీఆర్ చెబుతున్నారు.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై మీ వైఖరేంటో శాసన సభలో చెప్పండి..
కుర్చీ పోయిందనే.. కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ పోయిండు..


పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలని కేసీఆర్ ఎత్తుగడ…
భయపడనని ప్రగల్భాలు పలకడం కాదు… వచ్చి సభలో మాట్లాడు..


కాళేశ్వరం అవినీతి చర్చకు రాకుండా ఉండెందుకే నల్లగొండలో కేసీఆర్ సభ పెట్టుకున్నారు.
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది..
కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచుకోవాల్సిందే..
బీజేపీ, బీఆరెస్ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు?


మేడిగడ్డ సందర్శనకు బీజేపీ వాళ్లు వస్తారనుకున్నాం.
కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న బీజేపీ.. ఇప్పుడు ఎందుకు రాలేదు..


బీజేపీ వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంచేయాలి..
కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో… అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో చెప్పాలి..


కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం..
అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...