వైఎస్సార్ కు తోడునీడ కెవిపి

0
222

అలాంటి మిత్రుణ్ణి చూడలేదు
వైఎస్సార్ స్మారక పురస్కార సభలో సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 02 :
మహానేత వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కె.వి.పి. రామచంద్రరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతవరకూ నేను అలాంటి మిత్రుణ్ణి చూడలేదన్నారు. చెడును తనపై వేసుకుని, మంచిని మహానేతకు ఆపాదించిన సన్మిత్రుడు కె.వి.పి. అని రేవంత్ ప్రశంసించారు. నేను ముఖ్యమంత్రి అయిన తరవాత వారానికి ఇద్దరు ముగ్గురు తనవద్దకు వచ్చి… మీకు మేము కె.వి.పి.లా ఉంటామని అంటుంటారని చెప్పారు. ఇప్పుడు అలాగే అంటారు, కొన్ని రోజులకు నా కుర్చీలో కూర్చుంటానని అంటారని తనకు తెలుసనీ అన్నారు. కెవిపిలా ఉండడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఆయన వైఎస్సార్ కి చదువుతున్నప్పటి నుంచి మరణించే దాకా పక్కనే ఉన్నారన్నారు.


ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్న సుభాష్ పాలేకర్, డాక్టర్ సి. సుధ, డాక్టర్ సి. నాగేశ్వరరావులు వైఎస్సార్ మెమోరియల్ అవార్డులను రేవంత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, అప్ ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ఐ.టి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర బాబు, పి.సి.సి. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఎమెస్కో విజయకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి మాజీ రాజ్య సభ సభ్యుడు కె.వి.పి. రామచంద్ర రావు సారధ్యం వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…

సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు మిత్రులుగా వస్తారు..అధికారం పోయాక మాయం అవుతారు

చదువుకునే రోజుల నుండి మరణం వరకు వైఎస్ కి కేవీపీ రామచంద్ర రావు తోడు నీడగా నిలబడ్డారు.

రైతుల కోసం, వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెప్పడానికి వైఎస్ పని చేశారు

కేవీపీ రామచంద్ర రావు లాగా ఉంటానని కొంతమంది నా దగ్గరకి వస్తున్నారు..

ఈ తరానికి ఒకే వైఎస్, ఒకే కేవీపీ ఉంటారు..వారికి ప్రత్యామ్నాయం లేదు

తప్పులను తన ఖాతాలో, మంచిని వైఎస్ ఖాతాలో కేవీపీ వేసే వారు

సర్వం త్యాగం చేయగల గుణం, సమస్యలను ఎదుర్కొనే శక్తి కేవీపీకి ఉంది.

దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభావితం చేశారు.

ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేయడంతో పాటు రైతుల విద్యుత్ బకాయిలను,వారి పైన పెట్టిన కేసులను వైఎస్ రద్దు చేశారు.

2 రూపాయల కిలో బియ్యాన్ని రూపాయికే ఇచ్చారు.

ఉచిత కరెంట్ అంటేనే వైఎస్ పేరు గుర్తుకు వస్తుంది.

ఫీజు రీయంబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ఎవరు అధికారం లోకి వచ్చినా కొనసాగించాల్సి వస్తుంది.

తెలంగాణలో 3.10 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నాం.

ఇందులో వైఎస్ స్ఫూర్తి ఉంది.

అధికారంలోకి వచ్చిన 3 నెలలలోనే 2 లక్షల రైతు రుణ మాఫీ చేసాం.

25,35,694 మంది రైతులకు 20,617 కోట్ల రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించాం.

వరి వేస్తే ఊరే అని గత సీఎం అంటే మేం వరి వేస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చాం, చివరి గింజ వరకు కొన్నాం.

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంకోసం ప్రణాళికలు తయారు చేస్తాం.

తెలంగాణలో కరవు, వలసలను నివారించడం కోసం గోదావరి జలాలను తీసుకు రావడానికి వైఎస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు.

నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం ఎస్ ఎల్ బీ సీ ని వైఎస్ ప్రారంభించారు.

30 కిలోమీటర్ల సొరంగం తవ్విన తర్వాత పనులు ఆపేశారు.

ఎస్ ఎల్ బీ సీ ని మా ప్రభుత్వం పూర్తి చేసి రైతుల కలను నెరవేరుస్తుంది.

నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమేనని వైఎస్ గతంలో ప్రకటించారు.

రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడం కోసం నేను, వైఎస్ షర్మిల అవిశ్రాంతంగా పని చేస్తాం.

వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ప్రతిపక్ష ఎం ఎల్ ఏ గా అసెంబ్లీ లో బడ్జెట్ పైన ప్రభుత్వాన్ని నిలదీశాను.

మొదటి సారి ఎం ఎల్ ఏ అయినప్పటికీ నా విమర్శలకు వైఎస్ సభ లో సమాధానం ఇచ్చారు.

కోపం అనే నరం తెగిపోయిందని వైఎస్ చెప్పారు.

అధికారం లో ఉన్నపుడు అహంకారం లేకుండా ఆలోచన తో ప్రతిపక్షాలకు వైఎస్ సమాధానం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here