ఎన్.ఐ.ఐ.ఎం.హెచ్. అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 : ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటె కుటుంబం మొత్తం ఆరోగ్యంగానూ, సంతోషంగానూ ఉంటుందని N.I.I.M.H. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి. సుభాష్ చెప్పారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ లోని కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధన పరిషత్తు కు చెందిన నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సెప్టెంబర్ 25 న గడ్డిఅన్నారంలోని APAU కాలనీలోని ధర్మ నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆరోగ్యకరమైన మహిళలు – సాధికారత కుటుంబ ప్రచారం అనే అంశంపై సభను నిర్వహించారు.

కుటుంబ పునాది గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి ఇది ఏర్పాటైంది. ఒక తల్లి, కుమార్తె, సోదరి లేదా భార్య ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మొత్తం కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుందన్నారు.
ఒక స్త్రీ ఆరోగ్యం ఆమె సొంత ఆరోగ్యం మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబ ఆరోగ్యం కూడా. ఆమె మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నప్పుడు, ఆమె ఇంటిని బాగా నిర్వహించగలదు, తన పిల్లలను బాగా పెంచగలదు. ఏదైనా సవాలును ఎదుర్కోగలదు. ఆరోగ్యకరమైన స్త్రీ ఒక కుటుంబానికి కొత్త దిశను, నిర్దేశం ఇస్తుందని సుభాష్ వివరించారు.

ఆమెకు సరైన పోషకాహారం మరియు విశ్రాంతి లభించేలా చూసుకోవడం, సమస్యలను అర్థం చేసుకోవడం కుటుంబం బాధ్యతని చెప్పారు. మహిళలు సాధికారత పొందినప్పుడే మన కుటుంబాలు, సమాజం, దేశం సాధికారత పొందుతాయన్నారు. డాక్టర్ తపస్వాని, SRF (ఆయుర్వేదం), డాక్టర్ వైష్ణవి-SRF (ఆయుర్వేదం), వారి ఆరోగ్యాన్ని పరీక్షించి తగిన మందులను అందించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు కె. శ్రీనివాసరావు, వర్ష కుమారి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని NIIMH అసిస్టెంట్ డైరెక్టర్ (ఇన్-ఛార్జ్) డాక్టర్ జి.పి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు.


👌👌🙏🙏👍👍