బిజెపికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తాకట్టు

Date:

కె.సి.ఆర్.పై సీఎం రేవంత్ ధ్వజం
హైదరాబాద్, జూన్ 05 :
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. బి.జె.పి.కి తాకట్టు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చాయన్నారు. మా వందరోజుల పాలనకు ఇది రెఫరెండం అని ముందే చెప్పిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే…
 రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు.
 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు..
 వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం
 ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము.
 17పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
 ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి
 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వచ్చాయి.
 ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగింది..
 మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోంది.
 కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారు.
 2019లో బీజేపీ 4 గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు
 అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35శాతానికి పెరిగాయి.
 బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారు.
 బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆరెస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.
 ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీ కి బదిలీ చేశారు.
 రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారు.
 వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ కేసీఆర్ బీజేపీని గెలిపించారు.
 అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బీఆరెస్ ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయింది..
 2023లో 13శాతం ఓట్లున్న బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతంకు ఓట్లు పెరిగాయి.
 రాష్ట్రంలో బీఆరెస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ బీజేపీకి తాకట్టు పెట్టారు.
 పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ ఆరాచకానికి పాల్పడ్డారు.
 రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలిచారు.
 బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టేది లేదు..
 వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆరెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు.
 కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆరెస్ ను ప్రజలు తిరస్కరించారు.
 ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆరెస్ కు సూచన చేస్తున్నా.
 హరీష్… ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారు..
 మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు..
 బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయింది..
 మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారు.
 దేశ ప్రజలు మోదీని తిరస్కరించారు..
 తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలి..


 ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు.
 విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుంది..
 ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలి.
 ఇప్పటివరకు 18 గంటలే పనిచేసాం.. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తాం..
 రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదే..
 వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి..
 కేసీఆర్ బీజేపీ తో బేరసారాలు చేస్తున్నాడు..
 బీఆరెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలి.
 కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు… ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి.
 కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు అన్న బీజేపీ… బీఆరెస్ తో ఎలా జతకడుతుందో చూడాలి…
 ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం..
 ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...