వరద ప్రభావిత ప్రాంతాలకు జె.సి.బి.లో చంద్రబాబు

Date:

నాలుగున్నర గంటల పాటు విస్తృత పర్యటన
దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే ముఖ్యమంత్రి
అమరావతి:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే చంద్రబాబు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వదర బాధితులకు అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగితెలుసుకున్నారు. వారి ఆవేదన, బాధను విని ధైర్యం చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెండు రోజులుగా బసచేస్తున్న సిఎం…మూడవ రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి భవానీపురం వెళ్లారు. ముందుగా అక్కడ బాధితులతో మాట్లాడారు. తమకు సాయం చేరిందని…ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంత్వన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు. సితార సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వాయ్ పక్కన పెట్టి జెసిబి ఎక్కి ముందుకు కదిలారు.

దారి పొడవునా బాధితులతో మాట్లాడారు. అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సాయంపై తెలుసుకున్నారు. అక్కడి నుండి వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, నున్న, కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ కు వచ్చారు. అక్కడికి తన కాన్వాయ్ రావడంతో అక్కడి నుంచి కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు సిఎం అన్ని ప్రాంతాల్లో జేసీబీపైనే ప్రయాణం చేశారు. పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సిఎం అధికారులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీఎం తెలిపారు. అధికారులు బాధ్యత, మానవీయకోణంలో పనిచేయాలని సిఎం అన్నారు. సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరవేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. నీరు తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.


అనేక ప్రాంతాల్లో నాలుగున్నర గంటల పాటు ఆయన పర్యటన జేసీబీపైనే సాగింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సిఎం వరద బాధిత ప్రాంతాల్లోనే పర్యటించారు. ముఖ్యమంత్రి పలు చోట్ల పర్యటించి రామవరప్పాడు వంతెన సమీపంలో సాధారణ ప్రాంతానికి చేరుకున్నారు. సిఎం అక్కడికి వచ్చే సరికి ఆయన కాన్వాయ్ కూడా ఆ ప్రాంతానికి రాలేదు. దీంతో మరికొంత దూరం అయన జేసీబీపైనే ముందుకు సాగారు. సిఎం రూట్ పై సమాచారం అందుకున్న కాన్వాయ్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ నుంచి తన వాహనంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...