మీడియా అకాడమీ చైర్మన్ గా మరో రెండేళ్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించింది. బుధవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస రెడ్డి పదవీకాలం ఫిబ్రవరి 24తో ముగిసింది. తాజా ఉత్తర్వులతో 2028 ఫిబ్రవరి చివరి వరకు ఆయన చైర్మన్గా కొనసాగుతారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఫిబ్రవరి 24తో ముగిసింది.

దీంతో ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో 2028 ఫిబ్రవరి చివరి వరకు ఆయన మీడియా అకాడమీ చైర్మన్గా కొనసాగనున్నారు. పదవీ కాలం ముగిసిన మరుసటి రోజున ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇప్పుడు చైర్మన్ పదవీకాలాన్ని పొడిగించడంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం కొనసాగనున్నది.

