పారిస్ ఒలింపిక్స్‌లో ఫలించిన స్వప్నాలు

0
161

భారత షూటర్ స్వప్నిల్ కు కాంస్య పతకం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం.ఈ మూడు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి
పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ ఈవెంట్‌లో ఈ పతకం గెలిచాడు.
ఫైనల్లో స్వప్నిల్ 454.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.ఈ విభాగంలో చైనా షూటర్ స్వర్ణాన్ని గెలుచుకోగా, యుక్రెయిన్‌ షూటర్ సెర్హీ కులిష్ రజతాన్ని గెలిచాడు.గతంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడిన స్వప్నిల్, ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.28 ఏళ్ల స్వప్నిల్ స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో ఉన్న కంబల్‌వాడి గ్రామం.
2022లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వప్నిల్ బంగారు పతకం సాధించాడు.
గతంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడిన స్వప్నిల్, ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here