Saturday, March 25, 2023
Homeటాప్ స్టోరీస్ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం అభినంద‌న‌

ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం అభినంద‌న‌

ప్రతిష్టాత్మ‌క స‌మావేశం – అంద‌రి స‌హ‌కారం అవ‌స‌రం
రాజ‌కీయ వ్యాఖ్య‌లు వ‌ద్దు: వైయ‌స్ జ‌గ‌న్‌
న్యూఢిల్లీ, డిసెంబ‌ర్‌:
వచ్చే ఏడాది జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాలులో సోమ‌వారం సమావేశం ఏర్పాటైంది. సీఎం వైయస్‌.జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలుగా సహకరిస్తామ‌ని తెలిపారు. జి-20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం దేశంవైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.

రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమనీ, వాటిని మనవరకే పరిమితం చేసుకుని జి-2౦ సదస్సును విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి జ‌గ‌న్ విజయవాడ బయల్దేరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ