Thursday, March 23, 2023
HomeAP Newsచిత్రావ‌తికి ప‌ర్యాట‌క శోభ‌

చిత్రావ‌తికి ప‌ర్యాట‌క శోభ‌

లేక్ వ్యూ రెస్టారెంట్‌, బోటింగ్ ప్రారంభం
కొద్దిసేపు విహ‌రించిన సీఎం జ‌గ‌న్‌
కడప, డిసెంబర్2:
లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేలా రూ.4.1 కోట్లతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలను ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఇందులో పాంటున్ బోటు (15 కెపాసిటీ),డీలక్స్ బోట్ (22కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్ ,4 సీటర్ స్పీడ్ బోట్ ఉన్నాయి.

పర్యాటకుల భద్రతా చర్యల్లో బాగంగా స్టేట్ డిసాస్టర్ రిస్క్యూ (ఎస్ డి ఆర్) బోట్, ఫైర్ సర్వీస్ బోట్‌లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లేక్ వ్యూ పాయింట్ నుంచి రిజర్వాయర్ అందాలను తిలకించారు.

చిత్రావతి రిజర్వాయర్‌లో పాంటున్ బోటు ఎక్కి కాసేపు తిరిగారు.

ముఖ్యమంత్రి తో పాటు బోటులో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా, కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, ఎస్పీ అన్బు రాజన్, సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఓ.ఎస్.డి సీ.ఎం.ఓ కృష్ణమోహన్ రెడ్డి, టూరిజం ఎండి కన్నబాబు, పాడ అనిల్ కుమార్ రెడ్డి, ధర్మవరం ఎమ్యెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ