Tuesday, March 28, 2023
HomeBreaking Newsసింగీతం శ్రీ‌నివాస‌రావుకు స‌తీవియోగం

సింగీతం శ్రీ‌నివాస‌రావుకు స‌తీవియోగం

చెన్నై, మే 28:

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి క‌ళ్యాణి క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సింగీతం ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలియ‌జేశారు. శ‌నివారం రాత్రి 9.10కి ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు అందులో పేర్కొన్నారు. త‌మ‌ది 62 సంవత్సరాల వైవాహిక బంధ‌మ‌ని ఆయ‌న ఆ పోస్టులో తెలిపారు.


వ్యూస్ చానెల్ సింగీతం శ్రీ‌నివాస‌రావుగారిని ఇంట‌ర్వ్యూ చేసిన‌ప్పుడు వారి శ్రీమ‌తి గారిని కూడా కొద్దిసేపు మాట్లాడించ‌మ‌ని కోరాము. మ‌రోసారి క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇస్తామ‌ని ఆయ‌న వ్యూస్ వైజ‌యంతి మాటామంతిలో చెప్పారు. ఈలోగానే శ్రీ‌మ‌తి క‌ళ్యాణి క‌న్నుమూశారు. శ్రీ‌నివాస‌రావుగారికి ఈ దుఃఖ స‌మ‌యంలో మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని దేవుని కోరుకుంటున్నాం. ఆమె ఆత్మ‌కు శాంతి క‌లగాల‌నీ, స‌ద్గ‌తి ప్రాప్తించాల‌నీ ప్రార్థిస్తున్నాము. సినీ గేయ‌ర‌చ‌యిత భువ‌న‌చంద్ర త‌దిత‌ర ప్ర‌ముఖులు శ్రీ‌మ‌తి క‌ళ్యాణి మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ