Tuesday, March 21, 2023
Homeతెలంగాణ వార్త‌లుజ‌ర్న‌లిస్టులతో నాది ఉద్య‌మ సంబంధం

జ‌ర్న‌లిస్టులతో నాది ఉద్య‌మ సంబంధం

పాత్రికేయుల స‌మ‌స్య‌ల‌పై సానుకూలం
ప‌రిస్థితులు బట్టీ చ‌ర్చించి నిర్ణ‌యం
ఢిల్లీలో జ‌ర్న‌లిస్టు నేత‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశం
హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 16:
తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
మీడియా అకాడెమీ ద్వారా జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తున్నదనన్నారు. అక్రిడేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నదని, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందనీ సీఎం కేసిఆర్ అన్నారు.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా అభినందనలు, తమ సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ కి వచ్చిన అల్లం నారాయణ ఇతర జర్నలిస్టు నేతలతో సీఎం కేసిఆర్ రెండోరోజు శుక్రవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సంద‌ర్భంగా జర్నలిస్టు నేతలు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. పలు జర్నలిస్టు సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసిఆర్, ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిస్థితులను బట్టి చర్చించి పరిష్కరించుకుందామన్నారు.

తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యు జె) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐ జే యు) జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సీఎం కేసిఆర్ ను ఆహ్వానించగా సీఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు విషయాలపై సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను సీఎం కేసిర్ అదేశించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ తో పాటు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, అవ్వారి భాస్కర్ తదితరులున్నారు..l

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ