జేఎన్‌జే హౌసింగ్ డైరెక్ట‌ర్‌గా వంశీ

Date:

255 ఓట్లు తెచ్చుకున్న ఉద‌య్‌
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 5:
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్నలిస్ట్స్ మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ డైరెక్ట‌ర్ ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌లో నిమ్మ‌కాయ‌ల వంశీ శ్రీ‌నివాస్‌ ఎంపిక‌య్యారు. ఆయ‌న‌పై పోటీకి దిగిన జి ఉద‌య్‌కి 255 ఓట్లు ల‌భించాయి. వంశీకి 595 ఓట్లు, ఉద‌య్‌కి 255 ఓట్లు, కె. ర‌మేష్‌బాబుకు 6 ఓట్లు ప‌డ్డాయి. ఉద‌య్‌పై వంశీకి 340 ఓట్ల ఆధిక్య‌త ల‌భించింది. మొత్తం 1049 ఓట్ల‌కు 859 ఓట్లు పోల‌య్యాయి.

రెండు ఓట్లు చెల్ల‌కుండా పోయాయి. 14 ఏళ్ళుగా న‌లుగుతున్న జేఎన్‌జే సొసైటీ భూముల అంశం ఆగ‌స్టు నెల‌లో అప్ప‌టి చీఫ్ జ‌స్టిస్ ఎన్.వి. ర‌మ‌ణ ధ‌ర్మాస‌నం ఇచ్చిన తీర్పుతో ఒక కొలిక్కి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో సొసైటీలో డైరెక్ట‌ర్ వంశీ కాల వ్య‌వ‌ధి పూర్తికావ‌డంతో ఎన్నిక నిర్వ‌హించారు. వెయ్యి మంది పైగా ఉన్న సొసైటీ స‌భ్యుల ఆశ‌ల‌ను సాకారం చేసే దిశ‌గా క‌మిటీ ప‌ని చేయ‌డానికి ఈ ఎన్నిక అవ‌కాశం ఇస్తుంది. స‌భ్యుల‌లో ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేసి, ముంద‌డుగు వేయాల్సిన బాధ్య‌త కూడా క‌మిటీ మీద ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...