భూ స‌ర్వేలో దేశానికి ఏపీ దిక్సూచి కావాలి

Date:

వెబ్‌ల్యాండ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో పార‌ద‌ర్శ‌క‌త‌
జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు స‌మీక్ష‌లో వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం
2023 సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకు స‌ర్వే పూర్తి
మొత్తం 154 అత్యాధునిక డ్రోన్ల‌తో భూసర్వే
ముఖ్య‌మంత్రికి తెలిపిన అధికారులు
అమరావతి, మార్చి 31:
రికార్డుల‌ను ఎవ‌రూ మార్చ‌లేని విధంగా రూపొందించాల‌నీ, ట్యాంపర్ చేయ‌డానికి సైతం వీలులేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గురువారం త‌న క్యాంప్ కార్యాల‌యంలో వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ఆయ‌న స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు స‌మ‌గ్ర స‌ర్వేకు సంబంధించిన వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అందించారు. స‌ర్వే కోసం అత్యాధునిక టెక్నాల‌జీతో రూపొందించిన డ్రోన్‌ను అధికారులు సీఎంకు చూపించారు. దాని ప‌నితీరును వివ‌రించారు. 41 డ్రోన్లు ఏప్రిల్ 5 నాటికి స‌ర్వే ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతాయ‌ని చెప్పారు. వేగంగా ప‌ని పూర్తి చేయ‌డానికి మ‌రో 20 డ్రోన్ల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపారు. మొత్తం మీద 154 డ్రోన్ల‌ను స‌ర్వేకోసం వినియోగిస్తామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. ఇప్పటివరకూ 1441 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తిచేశామ‌నీ, వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర స‌ర్వే పూర్తిచేయ‌డానికి నిర్ణ‌యించామ‌న్నారు. రెవిన్యూ గ్రామం వారీగా సర్వే చేస్తున్నామ‌న్నారు. సర్వే ఫలితాలు పూర్తిగా అందే సమయానికి రికార్డుల స‌రిదిద్ద‌డం పూర్త‌వుతుంద‌న్నారు.


అప్‌డేష‌న్‌తో పాటు భూ హ‌క్కు ప‌త్రం అంద‌జేత‌
వెబ్‌ ల్యాండ్‌ అప్‌డేషన్, గ్రామ ల్యాండ్‌ రిజిస్టర్‌ అప్‌డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్‌తో పాటు జగనన్న భూ హక్కు పత్రాన్ని కూడా హ‌క్కుదారుకు అంద‌జేస్తామ‌ని అధికారులు చెప్పారు. గ్రామ సచివాలయాల వారీగా భూ వివరాలను స‌రిచేస్తున్నామ‌ని తెలిపారు. దీనివల్ల గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం ల‌భిస్తుంద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. 5200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకున్నట్టు అధికారులు సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఓఆర్‌ఐ (ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్‌ నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని సీఎంకు వివ‌రించారు.


వెబ్‌ల్యాండ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టండి
వెబ్‌ల్యాండ్‌లో గ‌తంలో ఎదురైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఇందులో అనుసరించాల్సిన విధానాలనూ, ఎస్‌ఓపీలనూ తయారు చేయాలని కోరారు. రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్‌ చేయలేని విధంగారూపొందించాల‌ని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్‌ రికార్డులు కూడా తయారుచేయాలని సూచించారు. ఈ ఫిజికల్‌ డాక్యుమెంట్‌ను కూడా ఎప్పటికప్పుడు స‌రిచేస్తుండాల‌ని కోరారు. సబ్‌ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే చేసేలా చూడాలని చెప్పారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని ఆదేశించారు. లంచాలకు తావులేకుండా ఈ వ్యవస్థ నడవాలని సీఎం ఆకాంక్షించారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నారు. ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్ప‌ష్టంచేశారు.


మొబైల్ ట్రైబ్యున‌ల్స్ ఏర్పాటు
భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని అధికారుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమ‌వుతాయని సీఎం చెప్పారు. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేనాటికి వివాదాలు లేకుండా చూడాలని కోరారు. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలనీ, దీనివ‌ల్ల ఇది సాధ్యప‌డుతుంద‌నీ జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలన్నారు. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి మ‌న రాష్ట్రం దిక్సూచిగా మారాల‌ని సీఎం అభిల‌షించారు. అందుకనే సీనియర్‌ అధికారులను, సీనియర్‌ మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేశామని వివ‌రించారు.


ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...