Thursday, March 23, 2023
HomeAP Newsహ‌ర్ ఘ‌ర్‌మే తిరంగా మ‌హోత్స‌వ్‌: ముఖ్యమంత్రి జ‌గ‌న్

హ‌ర్ ఘ‌ర్‌మే తిరంగా మ‌హోత్స‌వ్‌: ముఖ్యమంత్రి జ‌గ‌న్

దేశ భ‌క్తి భావ‌న పెంపొందించేందుకు కృత‌నిశ్చ‌యం: జ‌గ‌న్‌
ఆగ‌స్టు 13 నుంచి 15 వ‌ర‌కూ
హ‌ర్ ఘ‌ర్‌మే తిరంగా మ‌హోత్స‌వ్‌
ముఖ్య‌మంత్రుల‌తో అమిత్ షా వీడియో కాన్ఫ‌రెన్స్‌
న్యూఢిల్లీ, జూలై 17:
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ సందర్భంగా ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ కార్యక్రమంపై దీనిని నిర్వ‌హించారు. క్యాంప్ కార్యాలయం నుంచి ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ సాగింది. ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఆగష్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వ‌హిస్తారు. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. ఈ సంద‌ర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఏమన్నారంటే…:
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న సందర్బంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సమగ్రమైన కార్యాచరణను రూపొందించింది.
పలు ప్రభుత్వ విభాగాలతో పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించాం.
ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి బహుముఖంగా ప్రచారం నిర్వహించాం.
పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించాం. చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించాం. ర్యాలీలు, సైకిల్‌ర్యాలీలు నిర్వహించాం. పోస్టర్లతోపాటు పలు కథనాలు కూడా ప్రచురించాం.
రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు సంబంధిత వ్యాపకంలో ఉన్న ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్యపరిచాం. సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్ధేశించాం.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పాం. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి, వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాం.
5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.
1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు.
1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు.
ప్రతి ఇంటిపైనా, సముదాయం పైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
ఈ కార్యక్రమంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ