Saturday, March 25, 2023
HomeArchieveకేసీఆర్‌ను క‌లిసిన టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు

కేసీఆర్‌ను క‌లిసిన టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు

నియామ‌కాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన నేత‌లు
జిల్లా అధ్య‌క్షుల రాక‌తో సంద‌డిగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌
హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 27:
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ .. జిల్లా అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో… గురువారం నాడు పలు జిల్లాల అధ్యక్షులు, నాయకులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా.
ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి టి.హరీశ్ రావు, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, వొడితెల సతీష్ కుమార్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఓంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కె.విద్యాసాగర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, కౌషిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం తదితరులు ఉన్నారు.

ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్, జనగామ జిల్లా అధ్యక్షుడు పి.సంపత్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షు జి.కృష్ణమోహన్ రెడ్డి లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్ సీఎంను కలిసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ