Tuesday, March 21, 2023
HomeAP Newsప‌శు వైద్యంలో న‌వ‌శ‌కం

ప‌శు వైద్యంలో న‌వ‌శ‌కం

ఏపీలో డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ
175 ప‌శు అంబులెన్సుల‌ను ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్‌
అమ‌రావ‌తి, మే 19:
ప‌శు వైద్యంలో ఆంధ్ర ప్ర‌దేశ్‌లో న‌వ‌శ‌కం ప్రారంభ‌మైంది. ప‌శువుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు 340 అంబులెన్సులు గురువారంనాడు త‌మ ప‌నిని ప్రారంభించాయి.

దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల‌ను కొనుగోలు చేశారు.

వీటిలో మొదటి విడతగా రూ.143 కోట్ల వ్యయంతో రూపొందించిన 175 పశువుల అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూశాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పశుసంవర్ధశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ