Tuesday, March 21, 2023
HomeAP Newsపిల్ల‌లూ ప్రపంచంతో పోటీ పడండి

పిల్ల‌లూ ప్రపంచంతో పోటీ పడండి

పెద్ద పెద్ద స్కూళ్లలో పిల్లలకు తీసిపోకూడదు
నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖల్లో సమూల మార్పులు: సీఎం వైయస్‌.జగన్‌
వేంపల్లె, జూలై 7:
వైయస్సార్‌ జిల్లా వేంపల్లెలో మనబడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పునర్‌నిర్మించిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ భవనాలను ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పిల్ల‌ల్లో స్ఫూర్తి నింపారు. పోటీ త‌త్త్వాన్ని పెంచుకోవాల‌నీ, ప్ర‌పంచంతో పోటీ ప‌డాల‌నీ పిలుపునిచ్చారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే..


ఇంతకముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో మీరు చూడవచ్చు. ఈ రెండు ఫోటోలు చూస్తే…( గతంలో స్కూల్‌ – పునర్‌ నిర్మాణం తర్వాత ఇప్పటి స్కూల్‌ ఫోటో చూపిస్తూ) ఇంతకముందు నాడు, ఈ రోజు నేడు.

ఇదే స్కూల్‌ పరిస్థితిలో ఏ రకంగా మార్పు జరిగిందనేది.. ఎంత గొప్పగా, చక్కగా కనిపిస్తుందో చూడవచ్చు. ఇంత మంచి కార్యక్రమాలు చేయగలిగే అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను.

అందరూ బాగా చదివాలి. ఈ రోజు మనం వేసే అడుగులు మంచి స్కూల్స్‌ నుంచి వస్తున్న పెద్ద, పెద్ద పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, మాట్లాడుతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి. గొప్పగా ఇంగ్లిషు మాట్లాడాలి.

ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలోకి మీరు అందరూ వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను.

మీకు అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌.అవినాష్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ