Saturday, March 25, 2023
HomeArchieveఓ మంచి ప్ర‌య‌త్నం

ఓ మంచి ప్ర‌య‌త్నం


మేథావుల‌తో గెట్ టు గెద‌ర్‌
అనుభ‌వాల‌ను పంచుకున్న అతిర‌థులు
(బండారు రామ‌ప్ర‌సాద‌రావు)

మేధావుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ కార్య‌క్ర‌మానికి అతిరథ మహారథులు త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి వేదిక‌గా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రామ‌స్వామి త‌న ఇంటిలో ఏర్పాట్లు చేశారు. ఇంత‌మంది త‌మ ఇంటికి రావ‌డం ప‌ట్ల రామ‌స్వామి, ప‌ద్మ దంప‌తులు ఆనందం వ్య‌క్తంచేశారు.

తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం తరఫున అన్నీ రంగాల మేధావుల సదస్సు నిర్వహించి మన గమ్యం సరియైన రీతిలో నడు స్తుందా? అన్న సంశయ నివృత్తి కి నిన్న అనుకున్నానో లేదో కార్యరూపం దాల్చెలా కార్యక్రమం కార్య చరణ చేశాను. ఒకరా ఇద్దరా దాదాపు ఇరవై మందిని ఒకే తాటి మీదకు తేవాలి అనే నా సంకల్పం నేరవేరింది. సీనియర్ పాత్రికేయులు వివిధ వార్త్గ పత్రికల్లో సంపాదకులుగా, ఎలక్త్రానిక్ మీడియా చానల్స్ లో వివిధ హొధాల్లొ పని చేసిన కె.రామచంద్రమూర్తి,

ఒక నాటి ఆకాశవాణి లో కీలక పాత్ర పొషించిన ఉషశ్రీ గారి అల్లుడు, ది వ్యూస్ సంపాదకులు కూచిమంచి విఎస్ సుబ్రహ్మణ్యం, సీనియర్ పాత్రికేయులు నిరంజన్ దేశాయ్, పివీ తనయులు పీవీ ప్రభాకర్ రావు, పివీ సమీప బంధువు యరబాటి చంద్ర శేఖర్ రావు, హై కోర్టు సీనియర్ న్యాయవాదులు రామారావు, శ్రీమతి బాకరాజు అనూరాధ, సాహితీ దిగ్గజం రుక్మాభట్ల కృష్ణ మూర్తి, తెలంగాణా యూనివర్సిటీ డీన్ వంశీ మోహ‌న్గా, ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన లక్ష్మణ్, నంగునూర్‌లో ప్రభుత్వ ఉన్నతోద్యోగంలో ఉన్న వడి తల ప్రభాకర్ రావు,

సామాజిక వేత్త తిరుపతి రెడ్డి, రిటైర్డ్‌ ఐ ఏ ఎస్ చక్రధర రావు గారు, సీనీ దర్శకులు ఎస్ ఎస్ పట్నాయక్, ఆర్గానిక్ వ్యవసాయం లో దిట్ట బాకరాజు హన్మంత రావు హాజరయ్యారు. ఈ కార్య క్రమానికి పిలవగానే సమ్మతించి ఏజండా కన్నా నా పిలుపే ఆత్మీయంగా భావించి వచ్చిన సీనియర్ రాజకీయ వేత్త, సాహీతీ దిగ్గజ యోధుడు మణికొండ లక్ష్మి కాంత‌రావు గారు, ఇటీవలే ఎమ్మెల్సీ గా ఎన్నికైన డాక్టర్ యాదవ రెడ్డి, చిరకాల మిత్రులు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ చ్గైర్మ‌న్ వంటేరు ప్రతాప రెడ్డి, ఉప్పల మెట్టయ్య హాజరయ్యారు…వీరే కాకుండా నలుగురు భారత ప్రధాన మంత్రుల వద్ద కీలక మైన బాధ్యత లు నిర్వ హించిన కంచర్ల ధర్మా రెడ్డి, లోక్ సత్తా ఉభయ తెలుగు రాష్త్రాల సమన్వయ కర్త, టీవీ వార్త విశ్లేషకులు బండారు రాం మోహన్ రావు,

ఈ కార్యక్రమానికి నాకు చేదోడు వాదోడుగా ఉన్న నా సోదరుడు బండారు రాం ఫణి ధర్ రావు గారు…నాకు ఆత్మీయ మిత్రులు…ఆప్యాయత తో పిలువగానే వచ్చిన అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కుసుంబ సీతారామారావు గారికి పేరు పేరున ఆత్మీయ వందనాలు…ఈ కార్య క్రమం లో రుచికర మైన భోజనాలు తో పాటు ఆత్మీయ ఆథిత్యం ఇచ్చిన పారిశ్రామిక వేత్త శ్రీమతి పద్మా రామస్వామి గారికి అబినందన మందార మాల! కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిథులు ఇలాంటి స‌మావేశాల‌ను త‌ర‌చూ ఏర్పాటు చేయాల‌ని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ